మేడ్చల్ ముచ్చట్లు: నాగారం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా పిజ్జా ఎక్స్ప్రెస్ ఔట్ లెట్ ప్రారంభించారు.నాగరం ప్రధాన రహదారి ఈ పిజ్జా ఎక్స్ప్రెస్ ఔట్ లెట్ ఏర్పాటు చేశారు. నాగారంలో ఉండే కాలనీవాసులకు, ఫుడ్ లవర్స్ కు చేరువలో ఉండాలనే ఉద్దేశ్యంతో నాగారం లో పిజ్జా ఎక్స్ప్రెస్ బ్రాంచ్ ప్రారంభించామని ప్రోప్రైటర్ రంగా నరేష్ అన్నారు. ఆన్లైన్ ఆర్డర్ చేస్తే డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని నాగారం తో పాటు చుట్టుపక్కల ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు. శుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.





