మేడ్చల్ ముచ్చట్లు :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా త్రైలోక్య మోహన చండీ హోమం నిర్వహించారు, అందులో భాగంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ మునిగల సతీష్ కుమార్ పాల్గొని మంత్రి మల్లారెడ్డికి శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ చామకురా మహేందర్ రెడ్డిని, డాక్టర్ భద్ర రెడ్డిని కలిసారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ ప్రెసిడెంట్ దున్నపోతుల యాదగిరి, అడ్వైజర్ రాధాకృష్ణ, సాయి, మహిళ వైస్ ప్రెసిడెంట్ సుశీల, జనరల్ సెక్రెటరీ రేణుక, మహేశ్వరి, అఖిల, భవాని తదితరులు పాల్గొన్నారు.




