మేడ్చల్ ముచ్చట్లు : మల్కాజ్గిరి అసెంబ్లీ ప్రవాస్ క్యాంపెన్లో భాగంగా మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన అశోక్ పూలే వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో డివిజన్లో పర్యటించారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఉమా ఇంట్లో అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇంచార్జి గా నియమింపబడిన అశోక్ ,ఎమ్మెల్సీ రామచందర్ రావు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గోపు రమణారెడ్డి, మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్, వినాయక నగర్ కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి , మల్కాజ్గిరి కన్వీనర్ సదానంద గౌడ్, జిల్లా నాయకులు బాలచందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.





