వరద బాధితులకు పండ్లు పంపిణీ చేసిన పోలీస్ సిబ్బంది

Telangana Chowrasta
0 Min Read

జవహర్ నగర్ పీఎస్ ఆధ్వర్యంలో భారీ వర్షాల కారణంగా ఖాళీ చేయించిన పాపయ్య నగర్ ప్రజలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. పాపయ్య నగర్ ప్రజలందరికీ భారీ వర్షాల కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ సీతారాం, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Share This Article
Leave a Comment