మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని తుంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయంజాల్ గ్రామం సేవాలాల్ మల్లన్న తాండాలో నూతనంగా నిర్మించిన “శ్రీ శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహరాజ్, శ్రీ శ్రీ శ్రీ జగదంబ దుర్గాదేవి రామ్ రామ్ మహరాజ్” ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది . ఈ పూజ కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానాని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ వాణి వీర రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పుల్ సింగ్, అశోక్, సేవాలాల్, మల్లన్న తాండా వాసులు తదితరులు పాల్గొన్నారు.





