అభివృద్ధిపథంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్

Telangana Chowrasta
1 Min Read

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ సతీష్ కుమార్12వ డివిజన్ శ్రీరామ్ నగర్ ను అభివృద్ధి చేస్తున్నందుకు తులసి కాలని ప్రజలందరూ కలిసి హర్షం వ్యక్తం చేస్తూ ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సంతోషం గా గడిపారు.కార్పొరేటర్ సతీష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపి అభినందిస్తూ శాలువాకప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నడు చేయనటువంటి పని మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కృషితో పేద ప్రజలు నివసిస్తున్నటువంటి జవహర్ నగర్ ని గుర్తించి వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్నడు లేని విధంగా అభివృద్ధి పదంలో నడుపుతున్నందుకు గాను మంత్రి మల్లా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సహాయశక్తుల ప్రయత్నిస్తున్నటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ కి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో కూడా మరలా బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలందరు అధిక మెజారిటీతో మంత్రి మల్లారెడ్డిని గెలిపించాల్సిందిగా అయన కోరారు .

Share This Article
Leave a Comment