
ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియల్లో అభిమానులను కట్టడి చేయకపోవడంతో అపశ్రుతి చోటు చేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ ఖాన్ మృతి చెందారు. ఈయన గద్దర్ కు సన్నిహితుడుగా ఉండేవారని చెబుతున్నారు. గద్దర్ ఇంటి వద్ద జహీరుద్దీన్ అలీఖాన్ కు గుండెపోటు వచ్చి కింద పడిపోయినట్లుగా భావిస్తున్నారు.


